మహేశ్వరం, మెయినాబాద్, చేవేళ్ల, శంకర్ పల్లి, వికారాబాద్, సంగారెడ్డి, సదాశివపేట్, భువనగిరి, ఆలేరు, జనగాం, చౌటుప్పల్, యాచారం, కందుకూరు, షాద్ నగర్, జడ్చర్ల వంటి ప్రాంతాల్లో ఈ ఫామ్ ప్లాట్ల స్కామ్ ఎక్కువగా జరుగుతోంది. డీటీసీపీ ప్రాంతీయ సంచాలకులు, రెరా సభ్య కార్యదర్శి ఒక్కరే కాబట్టి, ఈ అక్రమ ఫామ్ ప్లాట్ల గురించి సమాచారం తెప్పించుకోవాలి. అక్రమ రియల్టర్లకు శిక్షించి జరిమానా వేయాలి.
ఆకర్షణీయమైన ధర
కొందరు రియల్టర్లు ఏం చేస్తున్నారంటే లక్షన్నర లేదా రెండు లక్షలకే ఫామ్ ప్లాట్ అంటూ అమాయకుల్ని బురిడి కొట్టిస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా, ఓ ఐదు నుంచి పదేళ్ల తర్వాతనైనా ఆయా ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటూ నమ్మిస్తున్నారు. ఎవరూ మళ్లీ కొనకపోతే తామే తిరిగి కొంటామంటూ మరికొందరు హామీ ఇస్తున్నారు. చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు తమకొక ప్లాటు ఉంటుంది కదా అంటూ వెనకా ముందు చూసుకోకుండా కొనేస్తున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకున్న తర్వాతే అందులో స్థలం లేదా ఇల్లు కట్టుకోవచ్చు. ఇందుకోసం ల్యాండ్ యూజ్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే, కొందరు రియల్టర్లు చేస్తున్న ఫామ్ ప్లాట్స్ వెంచర్లలో ఎలాంటి కన్వర్షన్ చేయకుండానే వ్యవసాయ భూమిని నేరుగా విక్రయిస్తున్నారు. ఆ తర్వాత కొన్నవారు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
General
ఫామ్ ప్లాట్స్ స్కామ్! "రియల్ ఎస్టేట్ గురు" పరిశోధనలో వెలుగులోకి
ఇప్పటికే యూడీఎస్ స్కీమ్, ప్రీలాంచ్ ఆఫర్లతో కొందరు అక్రమార్కులు సామాన్య, మధ్యతరగతి వేతనజీవులతో ఆటాడుకుంటున్నారు. వారి సొమ్మును అప్పనంగా దోచేసుకుంటున్నారు. ఇవి చాలవన్నట్లు.. హైదరాబాద్ రియల్ రంగంలో ఫామ్ ప్లాట్స్ మోసం బయటికొచ్చింది. హెచ్ఎండీఏ, డీటీసీపీ, స్థానిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అనుమతుల్ని తీసుకోకుండా పలువురు రియల్టర్లు ఈ దందాను నిర్భయంగా జరుపుతున్నారు. కొందరు పంచాయతీల పాతతేదీలు వేసి ఈ దందాను నడిపిస్తుంటే.. మరికొందరేమో ఎలాంటి అనుమతి లేకుండానే ఇబ్బడిముబ్బడిగా అమ్మేస్తున్నారు. కేవలం చిన్న రియల్టర్లే కాదు.. బడా బడా కంపెనీలూ ఇలాంటి అక్రమ లావాదేవీలను జరుపుతున్నాయని రియల్ ఎస్టేట్ గురు చేసిన పరిశోధనలో వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొందరు రియల్టర్లు ఏం చేస్తున్నారంటే.. స్థానిక సంస్థలు కానీ రెరా నుంచి కానీ ఎలాంటి అనుమతి తీసుకోకుండా.. ఇష్టం వచ్చినట్లుగా లేఅవుట్ మ్యాపును తయారు చేసి ఫామ్ ప్లాట్లను అమ్మేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత నుంచి కొత్తగా రీజినల్ రింగ్ రోడ్డు వచ్చే ప్రాంతాలకు చేరువగా, వాటికి కాస్త అటూఇటూగా ఈ ఫామ్ ప్లాట్ల దందా ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగింది. ప్రధానంగా, ఆర్ ఆర్ ఆర్ ప్రకటన వెలువడిన తర్వాత ఈ తరహా మోసాలకు హైదరాబాద్ కేంద్రబిందువుగా మారింది. ఈ తతంగంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ నేతల హస్తం కూడా ఉందని డెవలపర్లు అంటున్నారు. ప్రతి ప్రాంతంలో వారికి తెలియకుండా ఈ మోసం జరిగే అవకాశమే లేదని చెబుతున్నారు.
Related News
celebrity-homes
No articles available.
No posts available
No posts available