- రెరా చట్టం కింద 6-9 నెలల వరకు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కాలపరిమితిని పొడిగించాలి.
- మార్చి 2023 వరకు అన్ని భవన నిర్మాణ అనుమతులను పొడిగించాలి.
- రియల్ ఎస్టేట్ పై ప్రభుత్వ పన్నులను హేతుబద్ధీకరించాలి.
- సిమెంట్ మరియు ఉక్కు ధరలను నియంత్రించాలి.
- వడ్డీ ఉపసంహరణ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి.
- లీజుకు తీసుకున్న వాణిజ్య రియల్ ఎస్టేట్లో చెల్లించిన జిఎస్టిపై ఇన్పుట్ క్రెడిట్ టాక్స్ మంజూరు చేయాలి.
- మరికొంత కాలానికి దివాలా చట్టం, ఆన్లైన్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వ్యవస్థను నిలిపివేయాలి.
Housing and Urban Affairs Secretary Durga Shanker Mishra[/caption]
ప్రభుత్వ సుంకాలను తగ్గించడానికి ప్రయత్నిస్తామన్నారు. ఉక్కు మరియు సిమెంట్ ధరల పెరుగుదలకు సంబంధించిన సమస్యను మంత్రిత్వ శాఖతో మరోసారి చర్చిస్తానని చెప్పారు. నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన వ్యాపారం చేయడంలో భారతదేశం యొక్క ర్యాంకింగ్ 186 నుండి 27 కి మెరుగుపడిందని కార్యదర్శి సమాచారం ఇచ్చారు. కొత్త ర్యాంకింగ్ ఎప్పుడైనా రావొచ్చని, తాము టాప్ -20 లో ఉంటామ"ని విశ్వాసం వ్యక్తం చేశారు.
సిమెంట్ మరియు ఉక్కులో అసాధారణమైన ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందుతున్నాం. గత ఏడాదిలో ఉక్కు ధరలు రెట్టింపు అయ్యాయని, సిమెంట్ రేట్లు 50-70 శాతం పెరిగాయి.
స్థూల జాతీయోత్పత్తిలో(జిడిపి) రియల్ ఎస్టేట్ రంగం వాటా ఏడు శాతమని కార్యదర్శి తెలిపారు. ఇది 200 బిలియన్ డాలర్ల పరిశ్రమ మరియు వేగవంతమైన పట్టణీకరణతో 1-ట్రిలియన్ డాలర్ల రంగంగా అవతరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్థికంగా బలహీనమైన విభాగం (EWS) మరియు అల్పాదాయ వర్గాలకు ఎక్కువ ఇళ్ల గిరాకీ ఉందని, నవ యువకులు సైతం 2-3 పడక గదుల్ని కోరుకుంటున్నారని వెల్లడించారు.
- సంజయ్ దత్, సీఈవో/ఎండీ, టాటా హౌసింగ్
